కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వలన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం…
ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కారణంగా మార్కెట్ కూడా సండే ఓపెన్ కావాల్సి వచ్చింది. ఇక బడ్జెట్లో ఏవైనా మెరుపులు ఉన్నాయంటే అది లేదు.
సిక్స్ పాయింట్ ప్లాన్… ఆరు స్తంభాల వ్యూహం..! బడ్జెట్లో ఇదే నిర్మలమ్మ వ్యూహం. లోక్సభలో 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఒకే దిశలో నడిపించే ఆరు బలమైన పాయంట్లను ముందుకుతెచ్చారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని కేంద్రంగా పెట్టి ఆరు అంశాలపై దృష్టి సారించడానికి ఒక స్పష్టమైన లాజిక్ ఉంది. తయారీ పరిశ్రమలు బలపడితే ఉద్యోగాలు వస్తాయి. పాత పరిశ్రమలు పునరుజ్జీవం పొందితే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు నిలబడతాయి. MSMEలు…
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోడీ విమర్శలు ప్రశంసలు కురిపించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం కాదని.. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యం అని ప్రధాని మోడీ అన్నారు.
కేంద్ర బడ్జెట్పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
Shashi Tharoor: కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ థరూర్.. నౌకాశ్రయాల సిద్ధీకరణ (షిప్ ప్రిపరేషన్), కనెక్టివిటీ అంశాల చర్చలో పాట్నా, వారణాసి వంటి నగరాల పేర్లు ప్రస్తావించారు.. కానీ, భారత్లో “అతి పెద్ది అయినా కేరళ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Union Budget 2026: దేశ రక్షణకు 2026 కేంద్ర బడ్జెట్లో నిధులను పెంచారు.రక్షణ మంత్రిత్వ శాఖ 2026-27కు సంబంధించి రూ. 7.8 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్లో భారత సైన్యం ఆధునీకీకరణ కోసం రూ. 2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 21.84 శాతం పెరుగుదల. సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లు, సీమాంతర ఉగ్రవాదం, పాకిస్తాన్, చైనాలతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డిఫెన్స్…
Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డిజిటల్ మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్టార్టప్లు, ఇన్నోవేషన్కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వానికి కీలకమని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది
Rupee Breakup: కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఒక లెక్క. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఏ వనరు నుంచి ఎంత వస్తోంది, అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తోందనే ఆసక్తికర విషయాలను ప్రభుత్వం వెల్లడించింది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా.. Union Budget 2026: కేంద్రం బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?…
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సామాన్యులపై ప్రభావం చూపే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ తర్వాత పలు వస్తువుల ధరలు తగ్గడంతో పాటు మరికొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గేవి: బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీలు, పన్నుల సవరణల కారణంగా కింది వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. *విదేశీ పర్యటన ప్యాకేజీలు *విదేశాల్లో విద్య (Foreign Education)…