First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్స్పెక్టర్గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్జెండర్ సింధు నాగర్కోవిల్కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని…
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
తమిళనాడు కాంగ్రెస్లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు.
Indian Fishermen: శ్రీలంక మరోసారి భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసింది. తమిళనాడు రామేశ్వరానికి చెందిన 23 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వీరి అరెస్ట్ జరిగింది. 23 మంది జాలర్లను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ అధికారులు ఆదివారం తెలిపారు. పార్క్ బే సముద్ర ప్రాంతంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో మత్స్యకారులు చేపలు పట్టినట్లు మత్స్యకార సంఘం పేర్కొంది.
Husband Pushed His Pregnant Wife from Running Bus in Tamil Nadu: గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.…
Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది.
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్మేట్కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
Matrimonial site: ఇటీవల కాలంలో మాట్రిమోనియల్ సైట్లలో పరిచయాలు మోసాలకు కారణమవుతున్నాయి. అమ్మాయిలకు మంచి వరుడిని తెవాలనే తల్లిదండ్రులు తపన కొందరు దుర్మార్గులకు ఆసరాగా మారుతోంది. ఉద్యోగం లేకున్నా, తనకు మంచి ఉద్యోగం, కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఫోజ్ ఇస్తూ యువతులను వలలో వేస్తున్నారు. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా ముందు వెనక ఆలోచించకుండా వారి చేతుల్లో మోసపోతున్నారు.