Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు (Gold Jewellery) తీసుకువెళ్లాలని తమిళనాడు సర్కార్కు ఆదేశించింది.
ఇందు కోసం ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో మార్చి 6, 7వ తేదీల్లో ఆభరణాలు తీసుకువెళ్లాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి ఆభరణాలు అప్పగించే ఉద్దేశంతో ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Harish Rao: "త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా".. హరీష్ రావు సంచలన ప్రకటన..
- ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
అక్రమ ఆస్తుల కేసులో 2014 సెప్టెంబరులో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ ఇచ్చిన తీర్పులో జయలలిత, ఎన్.శశికళ, జె.ఇళవరసి, విఎన్.సుధాకరన్లను దోషులుగా నిర్ధారించారు. వారందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి రూ.10 కోట్ల చొప్పున జరిమానా వేశారు. మే 11, 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను పునరుద్ధరించింది. అప్పటికే జయలలిత మరణించినందున, ఆమెపై ఉన్న అభియోగాలు తొలగిపోతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మిగితా ముగ్గురు మాత్రం నాలుగేళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.
ఇక జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను వేలం ద్వారా విక్రయించాలని తెలిపింది. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతూ జయలలిత మరణించారు. అప్పటి నుంచి కోర్టు కాగితాల్లోనే నలుగుతున్న ఈ కేసుపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ నగలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బంగారు ఆభరణాలను తీసుకోవడానికి ఓ అధికారిని కూడా ధర్మాసనం నియమించింది. మొత్తానికి జయలలిత ఆభరణాలు త్వరలో తమిళనాడుకు చేరనున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..