భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Fire accident: తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హస్పటల్ లో మంటలు చెలరేగిడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Muslim Bharatanatyam Artist: మతసామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు జహీర్ హుస్సేన్ తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి 600 వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు.
తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది.
Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతుందని అంచనా వేయబడింది , డిసెంబర్ 12 నాటికి శ్రీలంక , తమిళనాడు తీరాలకు చేరుకోవచ్చు. ఈ పరిణామం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే కొద్ది…
తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు.
తమిళనాడు సీఎం స్టాలిన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.