Pani Puri: “పవర్ ఆఫ్ పానీపూరీ”.. ఏడాదిలో రూ. 40 లక్షల చెల్లింపులు.. జీఎస్టీ నోటీసులు..
- పానీపూరి వ్యాపారికి జీఎస్టీ నోటీసులు..
- ఏడాదిలో ఏకంగా రూ. 40 లక్షల చెల్లింపులు..
- వైరల్గా మారిన పానీపూరీ బిజినెస్ సంపాదన..
- తమిళనాడు విక్రేత ఘటన వైరల్..
Pani Puri: ‘‘పానీపూరీ’’ మనదేశంలో ప్రసిద్ధిమైన స్ట్రీట్ఫుడ్. పిల్లల నుంచి పెద్దల దాకా సాయంత్రం వేళల్లో పానీపూరీ బండ్లు కలకలలాడుతుంటాయి. ఇంత క్రేజ్ ఉన్న ఈ పానీపూరీ వ్యాపారం ద్వారా విక్రేతలు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజానికి పానీపూరీ లేదా గోల్గప్పా పేరు ఏదైనా కానీ, ఈ వ్యాపారం ఇతర ఉద్యోగాల కన్నా చాలా బెటర్ అంటూ సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్ తెగవచ్చాయి.
Read Also: Allu Arjun : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పానీపూరీ విక్రేత రికార్డు స్థాయిలో UPI చెల్లింపులను స్వీకరించిన తర్వాత, జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. ఏడాదిలో ఏకంగా రూ. 40 లక్షల చెల్లింపులను రేజర్ పే, ఫోన్పే ద్వారా అందుకున్నట్లు తెలిసింది. గత 3 ఏళ్లలో ఈ చెల్లింపులను ట్రాక్ చేసి విక్రేతకు తమిళనాడు జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ చట్టాల ప్రకారం విక్రేతకు నోటీసులు పంపారు. విక్రేత చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోలేదని అధికారులు ఆరోపించారు.
నోటీసుల ప్రకారం.. పానీపూరీ బిజినెస్ ద్వారా 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 40,11,019 టర్నోవర్ జరగడం జీఎస్టీ అధికారుల కళ్లలో పడింది. ఇది చట్ట ప్రకారం.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే ఏదైనా ఒక ఎంటిటీ కనిష్ట మొత్తం కన్నా ఇది రెండు రెట్లు ఎక్కువ. డిసెంబర్ 17, 2024న నోటీసుల ప్రకారం.. విక్రేత వ్యక్తిగతంగా హాజరుకావాలని, కేసుకు మద్దతుగా పత్రాలు సమర్పించమని సమన్లు అందుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక ఇంజనీర్, ప్రొఫెసర్ సంపాదించే డబ్బు కన్నా పానీపూరీ వ్యాపారి సంపాదిస్తున్న రూ. 40 లక్షలు చాలా ఎక్కువ అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!