Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు
- అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్
- సిట్ ఏర్పాటు.. బాధితురాలికి రూ.25 లక్షలు ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. డీఎంకే ప్రభుత్వ మెతకవైఖరి కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇక బీజేపీ చీఫ్ అన్నామలై అయితే డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. బాధితురాలి పేరు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలోకి వచ్చిందన్నారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పరిణామాల కారణంగా విద్యార్థిని చదువుపై ఎలాంటి ప్రభావం పడకూడదని తెలిపింది. ఆమె నుంచి ఫీజు వసూలు చేయొద్దని అన్నా యూనివర్సిటీని ధర్మాసనం ఆదేశించింది.
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని డిసెంబరు 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఫొటోలు తీసి.. పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. అయితే తనకు జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టి ఓ యువకుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే మరో నిందితుడికి డీఎంకేతో సంబంధాలున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అతడిని ప్రభుత్వమే కాపాడుతుందని విపక్షాలు ధ్వజమెత్తాయి.
విపక్షాల ఆరోపణలను డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళల హక్కుల కోసం డీఎంకే కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారని.. అందుకే తక్షణ చర్యలకు ఆదేశించాలని కనిమొళి తెలిపారు.
Thoothukudi, Tamil Nadu | On alleged sexual assault of a student inside Anna University campus, DMK MP Kanimozhi Karunanidhi says, "…The Chief Minister has ordered action against the culprit without any bias. Accordingly, the accused has been arrested and action has been… pic.twitter.com/ktTkpsyJrz
— ANI (@ANI) December 28, 2024
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!