Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు
- అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్
- సిట్ ఏర్పాటు.. బాధితురాలికి రూ.25 లక్షలు ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. డీఎంకే ప్రభుత్వ మెతకవైఖరి కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇక బీజేపీ చీఫ్ అన్నామలై అయితే డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. బాధితురాలి పేరు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలోకి వచ్చిందన్నారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పరిణామాల కారణంగా విద్యార్థిని చదువుపై ఎలాంటి ప్రభావం పడకూడదని తెలిపింది. ఆమె నుంచి ఫీజు వసూలు చేయొద్దని అన్నా యూనివర్సిటీని ధర్మాసనం ఆదేశించింది.
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని డిసెంబరు 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఫొటోలు తీసి.. పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. అయితే తనకు జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టి ఓ యువకుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే మరో నిందితుడికి డీఎంకేతో సంబంధాలున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అతడిని ప్రభుత్వమే కాపాడుతుందని విపక్షాలు ధ్వజమెత్తాయి.
విపక్షాల ఆరోపణలను డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళల హక్కుల కోసం డీఎంకే కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారని.. అందుకే తక్షణ చర్యలకు ఆదేశించాలని కనిమొళి తెలిపారు.
Thoothukudi, Tamil Nadu | On alleged sexual assault of a student inside Anna University campus, DMK MP Kanimozhi Karunanidhi says, "…The Chief Minister has ordered action against the culprit without any bias. Accordingly, the accused has been arrested and action has been… pic.twitter.com/ktTkpsyJrz
— ANI (@ANI) December 28, 2024
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!