Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది.…
Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి.
Crime: తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంటిని వదిలేసి వచ్చిన 13 ఏళ్ల బాలికపై ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చెన్నైలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడు కూడా తనని పెళ్లి చేసుకుంటానని అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. జనవరి 25న, బాలిక తల్లి మైలాపూర్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు నుంచి తన కుమార్తె కనిపించడం లేదని చెప్పింది.
Shocking: తమిళనాడు తంజావూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వ మహిళాకళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో టాయిలెట్కి వెళ్లిన విద్యార్థిని బిడ్డను ప్రసవించింది. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు బిడ్డను చెత్తబుట్టలో పారేసింది. యూట్యూబ్లో చూస్తే బొడ్డు పేగుని కోసి పాపను చెత్తకుండిలో విసిరేసి క్లాస్ రూంకి తిరిగి వచ్చింది.
Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత చర్యలు ప్రారంభించారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులలో జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, పది వేలకు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా…
Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు…
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
Olive Ridley turtles: తూర్పు తీరం తాబేళ్ల మృత్యుకుహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబరు ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు, అటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకొని జీవనం సాగిస్తాయి.
Ajith Kumar : కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారికి అందజేస్తున్నారు. విద్య, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, పరిశ్రమ వంటి వివిధ రంగాల్లో సాధించిన వారికి కూడా ఇస్తారు. ఆ విధంగా 2025లో మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. దీని ప్రకారం 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. 23 మంది మహిళలు…