Tamil Nadu: బతికున్న 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్ల్లో ఉంచి.. అక్రమ రవాణా(వీడియో)
- తాబేళ్ల అక్రమ రవాణాను బట్టబయలు చేసిన కస్టమ్స్ శాఖ
- చాక్లెట్ బాక్స్ల్లో నింపి అక్రమ రవాణా
- తిరుచ్చి విమానాశ్రయంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసింది. ఇప్పుడు కస్టమ్స్ బృందం, పోలీసులు ఈ తాబేళ్లను ఎవరు తీసుకువచ్చారు? వాటిని తిరుచ్చి విమానాశ్రయం నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం ఉదయం సమాచారం అందింది. ఈ విమానంలో పెద్ద మొత్తంలో తాబేళ్లను ఉంచారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ బృందం విమానం ల్యాండ్ అయిన వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఈ సమయంలో అనుమానాస్పదంగా కొన్ని చాక్లెట్ల బాక్స్లు కనిపించడంతో బృందం వాటిని తెరిచి పరిశీలించింది. ఈ కంపార్ట్మెంట్లన్నీ తాబేళ్లతో నిండిపోయాయి. అందులో దాదాపు 2447 తాబేళ్లు ఉన్నాయి.
READ MORE: Flight Accidents: డిసెంబర్ నెలలో 6 విమాన ప్రమాదాలు.. 236 మంది మృతి..
చాక్లెట్ బాక్సుల స్మగ్లింగ్లో ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాక్లెట్ బాక్సుల్లో మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడం బట్టబయలైంది. తిరుచ్చి విమానాశ్రయంలోనే ఇలాంటి మూడు-నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే చాక్లెట్ బాక్సుల్లో తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న ఉదంతం మాత్రం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కస్టమ్ శాఖ అటవీ శాఖ అధికారులను పిలిచి తాబేళ్లన్నింటిని తమ రక్షణలో అప్పగించింది.
On the basis of intelligence, officers of AIU, Trichy Airport seized 2447 live turtles brought by a PAX in his checked-in luggage. The passenger arrived from Kuala Lumpur on December 29: Trichy Customs
Photo & Video Source: Trichy Customs Officials pic.twitter.com/r9KQgLcElq
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!