Train Accident: పట్టాలు తప్పిన రైలు కోచ్లు.. తప్పిన పెను ప్రమాదం..
- తమిళనాడులో రైలు ప్రమాదం
- పట్టాలు తప్పిన కోచ్లు
- తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
READ MORE: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
దాదాపు 500 మంది ప్రయాణికులతో విల్లుపురం-పుదుచ్చేరి రైలు ఉదయం 5.25 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరింది. రైలు మలుపు దాటుతుండగా దాని కోచ్లు పట్టాలు తప్పడంతో లోకో పైలట్ వెంటనే రైలును ఆపారు. ఈ ప్రమాదం కారణంగా విల్లుపురం మార్గంలో ఉదయం 8.30 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విల్లుపురం-పుదుచ్చేరి మెము రైలు 38 కిలోమీటర్ల స్వల్ప దూరం ప్రయాణిస్తుంది.
READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..
ఇదిలా ఉండగా… చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల వేగం మందగించడం గమనార్హం. మనం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకొంది. దీని కారణంగా దృశ్యమానత మందగించింది. రైళ్ల నిర్వహణకు అంతరాయం కలిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల వరకు మొత్తం 39 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లు 30 నిమిషాలు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రైళ్లు నాలుగు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!