Maharastra : మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బుధవారం పెద్ద షాక్ తగిలింది. షిండే వర్గ సభ్యులపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ను అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తోసిపుచ్చారు.
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మే 26న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ షాహీ మసీదు ఈద్గా కమిటీ వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారించనుంది.
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 2022లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి నిన్న (శుక్రవారం) రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్లో హలాల్ సర్టిఫికేట్పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.