Ram Mandir: రామ మందిర వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదు.. కేంద్రం “నాన్ సెక్యులర్” అంటూ ముస్లిం ప్యానెల్ ఆగ్రహం..
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక వ్యాక్యలు చేసింది. ఈ సంస్థ చైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ కేంద్రం తీరును ఖండించారు. కేంద్రం నాన్ సెక్యులర్ విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇది హిందువుల కార్యక్రమమని..ఇస్లామిక్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొనవద్దని ప్రెస్నోట్ రిలీజ్ చేవారు. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలా, జై శ్రీరాం అంటూ నినాదాలు చేయాలా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని.. ఇది న్యాయం, లౌకికవాదాన్ని హత్య చేయడమే అని రహ్మానీ పేర్కొన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: China Manja : ఆర్మీ జవాన్ ప్రాణం బలిగొన్న చైనా మాంజా
ఇది బహుదేవతారాధన అని.. ముస్లింలు అర్థం చేసుకోవాలి, ఆలయ నిర్మాణం కోసం హిందూ సోదరులు ఆనందంగా దీపాలు వెలిగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఈ ప్రక్రియలో ముస్లింలు పాల్గొనకూడదని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం మనకు నిర్దేశిస్తోందని.. రాముడితో సహా హిందువుల పవిత్ర వ్యక్తుల్ని మేం గౌరవిస్తాం.. అయినప్పటికీ మేము వారిని దేవుళ్లుగా పరిగణించమని సైఫుల్లా రహ్మానీ చెప్పారు. ముస్లింలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. అది వారి హృదయాలను గాయపరిచింది అని జోడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!