Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందా? అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. 17ఏపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ పేర్కొనగా.. అసలు సెక్షన్ 17ఏ వర్తించదన్నారు జస్టిస్ బేలా.. దీంతో, ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.. 17ఏపై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు ద్విసభ్య ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్కు నివేదిస్తున్నాం.. 17ఏ అన్వయించడంలో మాకు భిన్నాభిప్రాయాలున్నాయన్నారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్.. దీంతో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ బాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పడినట్టు అయ్యింది.
కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు.. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. దీంతో, చంద్రబాబు పిటిషన్పై సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఇక, చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు స్ప్లిట్ జడ్జిమెంట్ ఇచ్చిందని.. ఈ కేసును ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల ధర్మాస్నానికి ప్రధాన న్యాయమూర్తి నివేదిస్తారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు ఎదురు దెబ్బనని ఆయన అన్నారు. చంద్రబాబు కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ తో పాటు అరెస్టును కూడా సుప్రీంకోర్టు సమర్థించిందని అంటున్నారు అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!