పంజాబ్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూ నిలకడ లేని మనిషి అని, పాక్ సీఎం, ఆర్మీ చీఫ్తో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయని, వారంతా స్నేహితులని అన్నారు.…
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రాజీనామా తరువాత పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనపై నమ్మకం లేదని, పార్టీలో అంతర్గత కలహాలపై తాను అనేకమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అయితే, పార్టీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుందని, తనను అవమానించే విధంగా వారి ప్రవర్తన ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో తనను మూడుసార్లు ఢిల్లీకి పిలిచారని, తాను…
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన అధిష్టానం.. సీఎం అమరీందర్సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.. కానీ, ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి.. కొంత శాంతింపజేసినా.. అమరీందర్ సింగ్ ను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది.. కానీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అక్కడ అసమ్మతి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, ఈ నేపథ్యంలో…
వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్లు ఉన్నాయి. అయితే, ముందస్తు సర్వే గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్, గుజరాత్లో మరోసారి కాషాయం పార్టీకి పట్టంగట్టే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీలో ప్రక్షాళన చేసింది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ను కొనసాగిస్తూనే పార్టీ పగ్గాలను మాత్రం…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలతో… పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను… బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని…
ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో గడిపేందుకు కూడా వారికి సమయం దొరకదు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాలన విషయంలో నిత్యం బిజీగా ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం రోజుజ గరిటె పట్టాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా రకరకాల వంటలు చేశారు. మటన్…
ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని…
ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత హాకీ టీమ్ ఒలింపిక్స్లో పతకాన్ని సాధించింది. జర్మనీని ఓడించి కాంస్యపతకాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల తరువాత హాకీ టీమ్ జట్టు పతకం సాధించడంతో దేశంలోని ప్రభుత్వాలు వారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం ఒ అడుగు ముందుకువేసి వారి ఘనత చిరస్తాయిగా నిలిచిపోయేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. పతకం సాధించిన…
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్లోని రూప్నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి.…
పంజాబ్లోని పాటియాలా నగరంలో ఓ కారు డ్రైవర్ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రెగ్యులర్ విధుల్లో భాగంగా పాటియాలాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. ఐతే కారు డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ తప్పుకునేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.…