జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు.
పెళ్ళికి నిరాకరించడంతో ఆదివారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలి ఆందోళనతో ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియుడు ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, వరుసగా ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. కుకునూర్ పల్లిలో ఆన్ లైన్ యాప్ నుంచి ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ మొత్తం చెల్లించిన ఇంకా నగదు చెల్లించాలని ఫోన్ చేసి లోన్ యాప్ నిర్వహకులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు.
జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో నలుగురిని కాల్చి చంపిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తాను వారిని కాల్చిన సమయంలో సృహాలో లేనని పోలీసులకు చెప్పాడు.
నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు.
సంగారెడ్డిలో పీజీ మెడికల్ విద్యార్థి ఆదృశ్యం కలకలం రేపుతుంది. తమిళనాడుకి చెందిన పీజీ మెడికల్ స్టూడెంట్ గోకుల్ నాథ్ తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి అదృశ్యమైయ్యాడు. నిన్నటి నుంచి గోకుల్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.
నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ నిన్న (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి.. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు.
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచకంగా.. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపడంపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.