హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలోని భోలక్ పూర్ లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్ర్కాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ప్రమాదంలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది.
హైదరాబాద్ లో నకిలీ ట్రాన్స్ జెండర్ల బెగ్గింగ్ మాఫియాలో కొత్తకోణం వెలుగులో వచ్చింది. రాజేష్, అనితలు కలిసి నకిలీ ట్రాంజెండలను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజేష్, యాదవ్ ల దగ్గర వంద మందికి పైగా నకిలీ ట్రాన్స్ జెండర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌరస్తాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులు అనేక క్రీడల్లో కూడా రానిస్తున్నారు.. ఇటీవల చాలా మంది తమలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.. కొందరికి టాలెంట్ ఉంటుంది.. కానీ అదృష్టం ఉండదు. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటుంది.. దాంతో క్రీడా లోకంలో వారు ధృవ తారలుగా వెలుగొందుతున్నారు. గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు.. అందుకే ప్రతిభావంతులకు కూడా అవకాశం లేక.. కేవలం గల్లీ క్రికెట్ కే పరిమితమయ్యారు. గల్లీ క్రికెట్లోని…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
ఉత్తరాఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.