PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇంధన కొరత ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్లోనూ దీని ఎఫెక్ట్ ఉంది. అయితే.. ప్రస్తుతం భారత్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కొరత లేనప్పటికీ.. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినట్లు సమాచారం. కొంతమంది వ్యాపారులు నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దీంతో సామాన్యూలు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాలనకు ప్రధాని మోడీ చెక్ పెట్టేశారు.
READ MORE: Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో LPG, CNG, PNG, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని సంబంధిత మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని తెలిపారు. ఇదే విషయంపై ముందుగా కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం స్పందించారు. భారత్ వద్ద Liquefied Natural Gas (LNG) నిల్వలు బాగానే ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గంతో పాటు ఇతర మార్గాల ద్వారా గ్యాస్ సరఫరా కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
READ MORE: AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
యుద్ధ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగినా దేశానికి ఇంధన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా Essential Commodities Act 1955 కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, LPG బుకింగ్ నియమాలను మార్చడం వంటి నిర్ణయాలు ఉన్నాయి. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తాజాగా “Natural Gas Supply Regulation Order 2026” ను ప్రకటించింది. ఈ ఆదేశం ప్రకారం ముందుగా గృహ వినియోగ ఎల్పీజీకే సరఫరాకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మొదటగా ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. ఆ తరువాత కమర్షియల్ గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఈ నిర్ణయం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి హాస్పిటాలిటీ రంగంలో కొంత ఆందోళన కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!