PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇంధన కొరత ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. భారత్లోనూ దీని ఎఫెక్ట్ ఉంది. అయితే.. ప్రస్తుతం భారత్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కొరత లేనప్పటికీ.. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినట్లు సమాచారం. కొంతమంది వ్యాపారులు నిల్వ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దీంతో సామాన్యూలు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాలనకు ప్రధాని మోడీ చెక్ పెట్టేశారు.
READ MORE: Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో LPG, CNG, PNG, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ఎలాంటి ప్రభావం పడకూడదని సంబంధిత మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని తెలిపారు. ఇదే విషయంపై ముందుగా కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం స్పందించారు. భారత్ వద్ద Liquefied Natural Gas (LNG) నిల్వలు బాగానే ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గంతో పాటు ఇతర మార్గాల ద్వారా గ్యాస్ సరఫరా కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
READ MORE: AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
యుద్ధ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగినా దేశానికి ఇంధన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా Essential Commodities Act 1955 కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, LPG బుకింగ్ నియమాలను మార్చడం వంటి నిర్ణయాలు ఉన్నాయి. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తాజాగా “Natural Gas Supply Regulation Order 2026” ను ప్రకటించింది. ఈ ఆదేశం ప్రకారం ముందుగా గృహ వినియోగ ఎల్పీజీకే సరఫరాకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే మొదటగా ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. ఆ తరువాత కమర్షియల్ గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఈ నిర్ణయం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి హాస్పిటాలిటీ రంగంలో కొంత ఆందోళన కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!