Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ జిల్లాలో NH–30పై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మంటకు క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే మంటలు వ్యాపించగానే ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బస్సు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం.
Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
Also Read
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
ఇక అందిన వివరాల ప్రకారం.. జై భవాని ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు (MP 30 P 7070) మార్చి 9న రీవా నుంచి ఇండోర్ కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కట్నీ సమీపంలో బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో డ్రైవర్ మెకానిక్ సహాయంతో మరమ్మతులు చేయించుకున్న తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును తిరిగి రీవాకు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో నదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేడా గ్రామం దగ్గర బస్సు ముందుభాగం నుంచి అకస్మాత్తుగా పొగ వచ్చి ఆ తర్వాత మంట రావడం ప్రారంభమైంది.
Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్ఛార్జ్ వడ్డింపు..
ఘటనపై బస్సు కండక్టర్ రుద్ర సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. బోనెట్ నుంచి పొగ, మంట కనిపించగానే డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ గాలి వేగం కారణంగా మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని ఆవరించాయి. ఈ గందరగోళంలో బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే నదన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రేణు మిశ్రా పోలీస్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రత దృష్ట్యా కొంతసేపు హైవే ట్రాఫిక్ను మళ్లించారు. ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కొద్దీ సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు ఎందుకు చెలరేగాయన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!