Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. శ్రమశక్తి భవన్ సమీపంలో అమర్చిన బ్యాగులో ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ బ్యాగ్ అక్కడే ఉండే ఓ ఎలక్ట్రిషియన్ కు చెందినదిగా గుర్తించారు.
Read Also: Nora Fatehi : ఉప్పొంగే పరువాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మరోవైపు ఎర్రకోట, కాశ్మీర్ గేట్, సరితా విహార్ లోని ప్రాంతాల్లో ఉన్న బ్యాగులను సైతం అధికారులు పరీక్షించి చూడగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా.. స్వాతంత్ర్య వేడుకల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు. ఏదేమైనప్పటికీ.. ఈ బాంబులకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపింది. రంగంలోని దిగిన ప్రత్యేక అధికారులు, విచారణ జరిపిన కొద్దిసేపటి తర్వాత అవన్నీ బోగస్ కాల్స్ గా పేర్కొన్నారు. విచారణలో అనుమానాస్పదంగా ఏమీ తేలకపోవడంతో శ్రమశక్తి భవన్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ను ఆంక్షలను తొలగించారు.
Read Also: TTD Key Decisions: టీటీడీ హైలెవల్ కమిటీ కీలక నిర్ణయాలు.. నడకదారిలో ఇకపై ఇవి కుదరదు..
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిఘా సంస్థలతో పాటు వివిధ కేంద్ర బలగాలు సైతం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు రేపు ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా.. పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!