Missing Girl: హైదరాబాద్ లో బాలిక మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బాధిత ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ లభ్యమైంది. బాలిక పేరెంట్స్ తిలక్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా ఉంటున్నారు. రమ్య అంబర్ పెట్ పోలీస్ లైన్ లోని జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. బాలిక కిడ్నాప్ కేసును కాచిగూడ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Anirudh: జైలర్ దెబ్బకి ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్
Also Read
బాలిక తల్లిదండ్రులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పాప ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు అన్నారు. ముడు రోజులుగా పాప ఆచూకి కోసం వెతికామూ అని తెలిపారు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగలేదు.. మాకు ఎవరి పైన కూడా అనుమానం లేదు అని వారు వెల్లడించారు. మా బందువుల ఇంటికి పాప వెళ్లలేదని చెప్పారు అని బాలిక రమ్య తల్లిదండ్రులు అన్నారు.
Read Also: CONGRESS vs BJP: ఖర్గే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు
దీంతో రమ్మ అదృశ్యమైనట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాము అని బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పాపకు కొద్దిగా మతిస్థిమితం సరిగ్గా లేదు.. అయితే, తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ రూట్ లో మా పాప నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ చూశాము అని వారు తెలిపారు. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మా పాప తప్పిపోయిందని కాచిగూడ పోలీసులకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. మా పాప ఇంటికి క్షేమంగా తిరిగిరావాలని భగవంతూన్ని ప్రార్థిస్తున్నామని బాలిక రమ్య తల్లిదండ్రులు కోరారు. బాలిక మిస్సింగ్ పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!