Missing Girl: హైదరాబాద్ లో బాలిక మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బాధిత ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ లభ్యమైంది. బాలిక పేరెంట్స్ తిలక్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా ఉంటున్నారు. రమ్య అంబర్ పెట్ పోలీస్ లైన్ లోని జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. బాలిక కిడ్నాప్ కేసును కాచిగూడ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Anirudh: జైలర్ దెబ్బకి ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
బాలిక తల్లిదండ్రులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పాప ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు అన్నారు. ముడు రోజులుగా పాప ఆచూకి కోసం వెతికామూ అని తెలిపారు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగలేదు.. మాకు ఎవరి పైన కూడా అనుమానం లేదు అని వారు వెల్లడించారు. మా బందువుల ఇంటికి పాప వెళ్లలేదని చెప్పారు అని బాలిక రమ్య తల్లిదండ్రులు అన్నారు.
Read Also: CONGRESS vs BJP: ఖర్గే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు
దీంతో రమ్మ అదృశ్యమైనట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాము అని బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పాపకు కొద్దిగా మతిస్థిమితం సరిగ్గా లేదు.. అయితే, తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ రూట్ లో మా పాప నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ చూశాము అని వారు తెలిపారు. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మా పాప తప్పిపోయిందని కాచిగూడ పోలీసులకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. మా పాప ఇంటికి క్షేమంగా తిరిగిరావాలని భగవంతూన్ని ప్రార్థిస్తున్నామని బాలిక రమ్య తల్లిదండ్రులు కోరారు. బాలిక మిస్సింగ్ పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!