Missing Girl: హైదరాబాద్ లో బాలిక మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో బాధిత ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ లభ్యమైంది. బాలిక పేరెంట్స్ తిలక్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా ఉంటున్నారు. రమ్య అంబర్ పెట్ పోలీస్ లైన్ లోని జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. బాలిక కిడ్నాప్ కేసును కాచిగూడ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Anirudh: జైలర్ దెబ్బకి ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్
Also Read
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
బాలిక తల్లిదండ్రులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పాప ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు అన్నారు. ముడు రోజులుగా పాప ఆచూకి కోసం వెతికామూ అని తెలిపారు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగలేదు.. మాకు ఎవరి పైన కూడా అనుమానం లేదు అని వారు వెల్లడించారు. మా బందువుల ఇంటికి పాప వెళ్లలేదని చెప్పారు అని బాలిక రమ్య తల్లిదండ్రులు అన్నారు.
Read Also: CONGRESS vs BJP: ఖర్గే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్న బీజేపీ నేతలు
దీంతో రమ్మ అదృశ్యమైనట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాము అని బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పాపకు కొద్దిగా మతిస్థిమితం సరిగ్గా లేదు.. అయితే, తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ రూట్ లో మా పాప నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ చూశాము అని వారు తెలిపారు. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మా పాప తప్పిపోయిందని కాచిగూడ పోలీసులకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. మా పాప ఇంటికి క్షేమంగా తిరిగిరావాలని భగవంతూన్ని ప్రార్థిస్తున్నామని బాలిక రమ్య తల్లిదండ్రులు కోరారు. బాలిక మిస్సింగ్ పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!