మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్ను కొట్టి తీసుకెళ్లారు.
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పాకిస్థాన్ లోని పలు చర్చిలు, డజన్ల కొద్దీ ఇళ్లను తగలబెట్టడాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. మానవ, నైతిక విలువలు, సూత్రాలకు విరుద్ధంగా భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని పద్ధతులను యూఏఈ శాశ్వతంగా తిరస్కరించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మణిపూర్లో మరోసారి జాతీయ రహదారిని దిగ్భంధిస్తున్నట్టు కుకీ సంఘాలు ప్రకటించాయి. దీంతో సోమవారం తెల్లవారు జామునుంచి దిమాపూర్-ఇంఫాల్ జాతీయ రహదారి 2 దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు కుకీ సంఘాలు ప్రకటించాయి.
మియాపూర్ లో దారుణం జరిగింది. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేందుకు భర్త కుట్ర చేశాడు. పెళ్లి విందులో భార్య కుటుంబ సభ్యులను చంపేందుకు విష ప్రయోగం చేశాడు. ఈ విష ప్రయోగంతో భార్య తల్లి చనిపోగా.. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.