Home
Operation Sindoor
Operation Sindoor News
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
Operation Sindoor: 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టడం ఎవరూ మరిచిపోలేదు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2025 మే 10వ తేదీ ఉదయం, ఆపరేషన్ సిందూర్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోరుతూ పాకిస్థాన్ డీజీఎంఓ హాట్లైన్ ద్వారా భారత్ను సంప్రదించింది. అయితే, పాకిస్తాన్పై భారత్ చేయాల్సిన దాడులు సగం మిగిలి ఉండటంతో… -
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీని డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది. ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరుతో రూపొందిన ఈ రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన వ్యూహాలు, ప్రణాళికలను విపులంగా చూపించనున్నారు. గత ఏడాది… -
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Pakistan: భారత విమానాలకు, సైనిక విమానాలకు విధించిన గగనతల ఆంక్షల్ని పాకిస్తాన్ మరోసారి పొడగించింది. తాజా నిర్ణయం ప్రకారం, భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, భారత ఎయిర్లైన్స్ నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలకు పాకిస్థాన్ గగనతలం ఆగస్టు 23 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్మెన్ (NOTAM) జారీ చేసింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా,… -
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
PM Modi: ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన మెల్బోర్న్లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచ గుర్తింపును పొందాయని, దేశ సైనిక బలానికి ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిదర్శనమని అన్నారు. ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్ల శబ్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని, ఆ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారతదేశ రక్షణ… -
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Pakistan: ఆపరేషన్ సిందూర్లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ సైనికులకు ఆ దేశ ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటిస్తూనే ఉంది. భారత్తో జరిగిన ఘర్షణలో తామే గెలిచామంటూ ఫేక్ ప్రచారం చేసుకుని, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి పొందాడు. ఇదే కాకుండా ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ తన సైనికులు జీతాలను 25 శాతం పెంచింది. ఆపరేషన్ సిందూర్ వల్ల కలిగిన… -
Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
Bangladesh: ఆపరేషన్ సిందూర్లో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనా తయారీ యుద్ధ విమానాలైన J-10CE ఫైటర్ జెట్లు 24 కొనుగోలు చేసే ప్లాన్ చేస్తోంది. ఆగస్టు నాటికి ఈ డీల్పై చైనా-బంగ్లాదేశ్ సంతకాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ డీల్ ఓకే అయితే బంగ్లాదేశ్ వైమానిక దళ సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే, ఇది భారత్కు ప్రమాదకరంగా మారింది. భారత సరిహద్దు దేశంలో చైనా ప్రాబల్యం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. J-10C ఎగమతి వెర్షన్గా J-10CE… -
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
IAF Masterstroke: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసిన బూటకపు ప్రచారాలు మరోసారి బట్టబయలయ్యాయి. భారత రక్షణ శాఖ (IAF) హెడ్క్వార్టర్స్ నుంచి విడుదలైన ఒక అధికారిక డాక్యుమెంట్ పాకిస్థాన్ అల్లిన కట్టుకథలను పూర్తిగా తిప్పికొట్టింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అన్ని (36 కి 36) రాఫెల్ విమానాలు ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, ఆపరేషనల్ స్థితిలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ… -
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్పై సంచలన రిపోర్ట్..
SIPRI Report: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ సైన్యం భారత్పై దాడికి ప్రయత్నిస్తే, ఆ దేశ వైమానిక దళానికి చెందిన కీలకమైన ఎయిర్బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడులతో పాకిస్తాన్ అణు అహంకారం బద్ధలైంది. పాకిస్తాన్ భారత్లో ఉగ్రదాడి చేసిన ప్రతీ సందర్భంలో తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చేది.… -
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
Rajnath Singh: హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్… -
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ పాకిస్తాన్కు గట్టిగానే తగిలినట్లు ఉంది. మరోసారి ఈ అంశాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు. కాల్పుల విరమణకు సహకరించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసించారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ట్రంప్నకు రుణపడి ఉంటుందని అన్నారు. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు. అమెరికా-పాకిస్తాన్ బంధం ప్రత్యేమైందని షరీఫ్ అన్నారు. ‘‘దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..