Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
- భారత్ దాడులు చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పరిస్థితి..
- కీలక విషయం చెప్పిన పాక్ మాజీ వైమానిక దళ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. పాకిస్తాన్ లోని బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు, మురిడ్కే లోని లష్కరే తోయిబా స్థావరాలను, పీఓకేలోని ఇతర ఉగ్రవాద స్థావరాలనను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదే కాకుండా పాక్ సైన్యం కవ్వింపులకు ధీటుగా బదులిచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన పలు ఎయిర్ బేసుల్ని క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేసింది.
అయితే, ఇన్నాళ్లు తమకేం నష్టం జరగలేదని చెబుతూ వస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు మాత్రం నిజాలను ఒప్పుకుంటోంది.పాకిస్తాన్ ఎయిర్ కమోడోర్(రిటైర్డ్) మాజీ పాకిస్తాన్ వైమానిక దళ అధికారి, రక్షణ విశ్లేషకుడు ఖలీద్ చిస్తీ, జీఎన్ఎన్ స్టూడియో పాక్కాస్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత పరిస్థితి ఎలా ఉందో వివరించారు.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
Read Also: Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!
భారత్ వరసగా మూడు రోజులు డ్రోన్ దాడులు చేసిందని, ఆరు పాకిస్తానీ వైమానిక స్థావరాలకు స్వల్ప నష్టం కలిగిందని చిస్తీ అన్నారు. ఈ ఎపిసోడ్ను పాకిస్తాన్ సైనిక సంసిద్ధత, ప్రతిస్పందనకు మలుపుగా అభివర్ణించారు. ‘‘పాకిస్తాన్కు ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యం లేదు, సామర్థ్యం ఉంటే ధైర్యం లేదు. మొత్తం సైన్యం ఆపరేషన్ గదిలో నమాజ్ చేసింది’’ అని ఆయన అన్నారు.
మే 7, 2025న ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత బ్రహ్మోస్ క్షిపణులు రావల్పిండిలోని పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్బేస్తో సహా 10కి పైగా ఎయిర్బేసుల్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ను కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత, పాక్కు బుద్ధి చెప్పింది. మరోసారి ఉగ్రవాద దాడి జరిగితే, ఇలాంటి ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!