Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
- భారత్ దెబ్బకు రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
- ఆపరేషన్ సిందూర్లో పాక్ ఎయిర్ బేసులపై దాడులు..
- ఇప్పటికీ మరమ్మతుల పనులు చేయించుకుంటున్న వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య గతేడాది మే నెలలో జరిగిన యుద్ధం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కేవలం 88 గంటల్లోనే పాకిస్తాన్ను భారత్ కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. పాక్, పీఓకేలోని లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే, భారత వాయు సేన ఏకంగా పాక్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఏకంగా 10కి పైగా పాక్ ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి.
Read Also: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ఇదిలా ఉంటే, భారత్ చేసిన దాడుల తర్వాత ఇప్పటికీ పాకిస్తాన్ రిపేర్లు చేయించుకుంటుంది. పాక్ భోలారి ఎయిర్బేస్ పునర్నిర్మాణం ప్రారంభమైందని శాటిలైట్ ఇమేజ్లు చూపిస్తున్నాయి. 2025 మే 10న ఉదయం 10-12 గంటల మధ్యలో భారత్ ఎయిర్ ఫోర్స్ భోలారి ఎయిర్ బేస్పై మిస్సైల్ అటాక్ చేసింది. పాకిస్తాన్కు ఎంతో కీలకమైన SAAB 2000 ‘Erieye’ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం ఈ దాడిలో ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భోలారి హ్యాంగర్ పూర్తిగా దెబ్బతింది. మురీడ్, సుక్కూర్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లు కూడా భారత దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఉండటం గమనార్హం.
మే 9 రాత్రి మొదలైన దాడుల్లో భారత వాయుసేన కనీసం 10 ప్రధాన పాక్ ఎయిర్ బేసుల్ని లక్ష్యంగా చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల నుంచి స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడింది. సుఖోయ్ 30 MKI నుంచి ఇజ్రాయెల్ రాంపేజ్ క్షిపణులను ఉపయోగించింది. మిరేజ్-2000 నుంచి క్రిస్టల్ మేజ్ క్షిపణులు, సుఖోయ్ ద్వారా బ్రహ్మోస్ ఎయిర్ టూ సర్పెస్ క్షిపణులను ప్రయోగించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నూర్ ఖాన్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, సుక్కూర్, మురీడ్, నయాచోర్ ఇలా పలు ఎయిర్ బేసులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?