పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత్ నినదించిన వేళ భారత్ పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడుల నేపథ్యంలో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లే అన్ని…
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు.