Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఆపరేషన్ సిందూర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చిన ట్రంప్
- నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటిదాకా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్.. తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన జోక్యం లేకపోతే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చనిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అడ్డుతగలకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేదన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ ప్రధానితో సహా 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
బుధవారం అమెరికా పార్లమెంట్లో ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. దాదాపు గంటా 41 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా 10 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లుగా గుర్తుచేశారు. ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం-పాకిస్తాన్, సెర్బియా-కొసావో, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్బైజాన్, కంబోడియా-థాయిలాండ్ యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో ఉగ్ర మూకల దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7, 2025న భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల యుద్ధం తర్వాత పరస్పర ఒప్పందం కారణంగా కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించడంతో భారత్ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని కొట్టిపారేసింది. పాకిస్థాన్ మాత్రం.. ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా వార్షిక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు తానే కాపాడానంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!