Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఆపరేషన్ సిందూర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చిన ట్రంప్
- నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడని వ్యాఖ్య
ఆపరేషన్ సిందూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటిదాకా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్.. తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన జోక్యం లేకపోతే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చనిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అడ్డుతగలకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేదన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ ప్రధానితో సహా 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
బుధవారం అమెరికా పార్లమెంట్లో ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. దాదాపు గంటా 41 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా 10 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లుగా గుర్తుచేశారు. ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం-పాకిస్తాన్, సెర్బియా-కొసావో, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్బైజాన్, కంబోడియా-థాయిలాండ్ యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో ఉగ్ర మూకల దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7, 2025న భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల యుద్ధం తర్వాత పరస్పర ఒప్పందం కారణంగా కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించడంతో భారత్ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని కొట్టిపారేసింది. పాకిస్థాన్ మాత్రం.. ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా వార్షిక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు తానే కాపాడానంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!