Iran War: మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే, ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ముందుగానే చెప్పనట్లు తెలుస్తోంది. మొసాద్ ముందుగానే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి, ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు సమాచారం. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా.. ఇరాన్లో పాలనా మార్పు సాధ్యమేనని కానీ దానికి సమయం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రక్రియ, యుద్ధం వారాలు నెలలు…
Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్కు మాత్రమే ప్రమాదం కాదని, యావత్ ప్రపంచానికి ప్రమాదమని హెచ్చరించారు
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. యుద్ధం ప్రారంభమై 16 రోజులకు చేరింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్పై దాడులు చేసిన తొలిరోజే ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. దీంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను చంపేస్తామని ఇరాన్ ఆదివారం ప్రతిజ్ఞ చేసింది.
Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. అయితే, ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలు పుట్టిస్తోంది. అనేక మంది ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎక్కడ ఉన్నారు? అని అడుగుతున్నారు. మార్చి 13న ఆయన చేసిన తాజా వీడియోపై అనేక మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు, ఈ వీడియో ఆయన చేతిలో ఆరు వేళ్లు ఉన్నట్లు అనిపించింది. ఏఐ ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారనే అనుమానాలను లేవనెత్తారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తపస్వి ఛావని పీఠాధిపతి జగద్గురు పరమహంసాచార్య మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు అందించారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయన ఫోటోకు తిలకం పెట్టి పూజలు నిర్వహించారు. నెతన్యాహూ ‘‘మహాపురుషుడు’’ అంటూ కొనియాడారు.
మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో పశ్చిమాసియా గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. బాంబ్ దాడులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.