Benjamin Netanyahu: భారత్కు ఇజ్రాయిల్ మద్దతు.. ఢిల్లీ ఘటనపై నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..
- ఢిల్లీ ఉగ్ర ఘటనపై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని..
- బాధిత కుటుంబాలకు నెతన్యాహూ సంతాపం..
- ఉగ్రవాదానికి లొంగిపోయేది లేదని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ‘‘ మా ప్రియమైన మిత్రుడు నరేంద్రమోడీకి, భారతదేశంలో ధైర్యవంతులైన ప్రజలకు.. నేను, ఇజ్రాయిల్ ప్రజలు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ విషాద సమయంలో ఇజ్రాయిల్ మీతో బలంగా నిలుస్తుంది’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు.
భారత్, ఇజ్రాయిల్ పురాతనమైన నాగరికతలు అయినప్పటికీ, అవి ఒకే రకమైన కఠిన పరీక్ష అయిన ఉగ్రవాదంతో బాధపడుతున్నాయి, రెండు దేశాలు ఉగ్రవాదానికి ఎప్పటికీ లొంగిపోవని నెతన్యాహూ అన్నారు. భారత్, ఇజ్రాయిల్ శాశ్వత సత్యాలపై నిలబడే పురాతన నాగరికతలు, దాడులు మన నగరాలను తాకవచ్చు కానీ, మన ఆత్మలను ఎప్పటికీ కదిలించలేవు, మన దేశాలు వెలుగులు మన శత్రువుల చీకటిని అధిగమిస్తాయి అని ఆయన అన్నారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ మాత్రమే కాకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలని ఈ ఉగ్ర డాక్టర్లు ప్లాన్ చేశారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీ అని భావిస్తున్నారు. ఇప్పటికే మరో ముగ్గురు డాక్టర్లు షహీన్ సయీద్, ముజ్మిల్ షకీల్ గనాలే, అదీల్ రాథర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నెతన్యాహుకు ముందు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ కూడా భారత్ దేశానికి సంఘీభావం తెలిపారు. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన అమాయక బాధిత కుటుంబాలకు ఇజ్రాయిల్ తరుపున సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ఈ దాడిని ‘‘హృదయ విదారకమైంది’’గా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!