Gaza-Israel: గాజాలో మళ్లీ దాడులు.. 30 మంది మృతి
- గాజాలో మళ్లీ దాడులు
- 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి. మరోసారి హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ దళాలపై దాడులకు తెగబడిందన్న ఆరోపణలతో ప్రధాని నెతన్యాహు శక్తివంతమైన దాడులకు ఆదేశించారు. దీంతో గాజాపై ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేయడంతో 30 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో జాగ్రత్త..!
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడి తర్వాత పొగలు ఎగిసిపడ్డాయి. గాజాలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఫోర్స్గా పనిచేస్తున్న ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సంధిని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని గాజా పౌర రక్షణ సంస్థ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో ఘర్షణలు ఉన్నప్పటికీ కాల్పుల విరమణ మాత్రం కొనసాగుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్
ప్రస్తుతం శాంతి ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న బందీల మృతదేహాలను అప్పగిస్తోంది. మంగళవారం మరో బందీని అప్పగిస్తామని హమాస్ తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి సమయం పడుతుందని హమాస్ తెలిపింది. కానీ ఇంతలోనే హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఇజ్రాయెల్కు దాడులకు దిగింది. తాజా ఘర్షణలతో మళ్లీ ఉద్రిక్తతలు మొదటికొచ్చాయి.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడులకు తెగబడి 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈనెలలో ట్రంప్ మధ్యవర్తిత్వంలో గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కానీ కొద్ది రోజులకే శాంతి ఒప్పందం గాడి తప్పింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!