Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం
- యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ పరిస్థితుల్లోనూ పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోమని ఇజ్రాయెల్ పేర్కొంది.
పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సహా మంత్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
గాజా-ఇజ్రాయెల్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇటీవల ట్రంప్ మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం జరిగింది. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందాన్ని అనుసరించి సోమవారం ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు ఓటింగ్ వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నెతన్యాహు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ భూభాగంలోనైనా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏక తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో మిత్రదేశమైన అమెరికా ఏం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?
ఐక్యరాజ్యసమితిలో చేయబోయే తీర్మానం ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీస్ యూనిట్లు భద్రతాగా ఉండనున్నాయి. అంతేకుండా క్రమక్రమంగా 2027 నాటికి పాలస్తీనా రాజ్యంగా కూడా విస్తరించనుంది. ఈ తీర్మానాన్ని వేగంగా ఆమోదించాలంటూ అమెరికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి. త్వరగా తీర్మానం ఆమోదించాలని విజ్ఞప్తి చేశాయి.
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..