Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం
- యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ పరిస్థితుల్లోనూ పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోమని ఇజ్రాయెల్ పేర్కొంది.
పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సహా మంత్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
గాజా-ఇజ్రాయెల్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇటీవల ట్రంప్ మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం జరిగింది. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందాన్ని అనుసరించి సోమవారం ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు ఓటింగ్ వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నెతన్యాహు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ భూభాగంలోనైనా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏక తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో మిత్రదేశమైన అమెరికా ఏం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?
ఐక్యరాజ్యసమితిలో చేయబోయే తీర్మానం ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీస్ యూనిట్లు భద్రతాగా ఉండనున్నాయి. అంతేకుండా క్రమక్రమంగా 2027 నాటికి పాలస్తీనా రాజ్యంగా కూడా విస్తరించనుంది. ఈ తీర్మానాన్ని వేగంగా ఆమోదించాలంటూ అమెరికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి. త్వరగా తీర్మానం ఆమోదించాలని విజ్ఞప్తి చేశాయి.
తాజావార్తలు
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?