Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం
- యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ పరిస్థితుల్లోనూ పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోమని ఇజ్రాయెల్ పేర్కొంది.
పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సహా మంత్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
గాజా-ఇజ్రాయెల్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇటీవల ట్రంప్ మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం జరిగింది. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందాన్ని అనుసరించి సోమవారం ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు ఓటింగ్ వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నెతన్యాహు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ భూభాగంలోనైనా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏక తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో మిత్రదేశమైన అమెరికా ఏం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?
ఐక్యరాజ్యసమితిలో చేయబోయే తీర్మానం ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీస్ యూనిట్లు భద్రతాగా ఉండనున్నాయి. అంతేకుండా క్రమక్రమంగా 2027 నాటికి పాలస్తీనా రాజ్యంగా కూడా విస్తరించనుంది. ఈ తీర్మానాన్ని వేగంగా ఆమోదించాలంటూ అమెరికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి. త్వరగా తీర్మానం ఆమోదించాలని విజ్ఞప్తి చేశాయి.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!