Trump-Netanyahu: వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్కు చివరి వార్నింగ్ ఏంటంటే..!
- వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ
- ఇరాన్ అణు ఒప్పందంపై రహస్య చర్చలు
- బోర్డ్ ఆఫ్ పీస్ ఫోరమ్లో సంతకం చేసిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరి సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని.. దౌత్యం అనిశ్చితంగానే ఉందని తెలిపారు. చర్చలు విఫలమైతే సమన్వయం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో నిరంతర చర్చలకు ఒత్తిడి తెచ్చానని.. ఇప్పటికీ చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తానికి వార్నింగ్ల దగ్గర నుంచి చర్చలకు ట్రంప్ తెరలేపారు.
Also Read
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ఇది కూడా చదవండి: Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి.. నిరసనకారులను చంపితే సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రానికి వచ్చి మోహరించింది. తక్షణమే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్-నెతన్యాహు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!
ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ పీస్లో ఇజ్రాయెల్ చేరింది. చాలా రోజుల తర్జన భర్జన తర్వాత నెతన్యాహు సంతకం చేశారు. ఈ ఫోరమ్లో పాశ్చాత్య భాగస్వాములతో పాటు టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయి. గతంలో గాజాలో వారి పాత్రపై ఇజ్రాయెల్ విమర్శలు చేసింది. మొత్తానికి శాంతి మండలిలో ఇజ్రాయెల్ చేరింది.

తాజావార్తలు
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!