Trump-Netanyahu: వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్కు చివరి వార్నింగ్ ఏంటంటే..!
- వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ
- ఇరాన్ అణు ఒప్పందంపై రహస్య చర్చలు
- బోర్డ్ ఆఫ్ పీస్ ఫోరమ్లో సంతకం చేసిన నెతన్యాహు
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరి సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని.. దౌత్యం అనిశ్చితంగానే ఉందని తెలిపారు. చర్చలు విఫలమైతే సమన్వయం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో నిరంతర చర్చలకు ఒత్తిడి తెచ్చానని.. ఇప్పటికీ చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తానికి వార్నింగ్ల దగ్గర నుంచి చర్చలకు ట్రంప్ తెరలేపారు.
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
ఇది కూడా చదవండి: Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి.. నిరసనకారులను చంపితే సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రానికి వచ్చి మోహరించింది. తక్షణమే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్-నెతన్యాహు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!
ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ పీస్లో ఇజ్రాయెల్ చేరింది. చాలా రోజుల తర్జన భర్జన తర్వాత నెతన్యాహు సంతకం చేశారు. ఈ ఫోరమ్లో పాశ్చాత్య భాగస్వాములతో పాటు టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయి. గతంలో గాజాలో వారి పాత్రపై ఇజ్రాయెల్ విమర్శలు చేసింది. మొత్తానికి శాంతి మండలిలో ఇజ్రాయెల్ చేరింది.

తాజావార్తలు
-
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
-
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
-
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
-
China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!