Trump-Netanyahu: వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్కు చివరి వార్నింగ్ ఏంటంటే..!
- వైట్హౌస్లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ
- ఇరాన్ అణు ఒప్పందంపై రహస్య చర్చలు
- బోర్డ్ ఆఫ్ పీస్ ఫోరమ్లో సంతకం చేసిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరి సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని.. దౌత్యం అనిశ్చితంగానే ఉందని తెలిపారు. చర్చలు విఫలమైతే సమన్వయం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో నిరంతర చర్చలకు ఒత్తిడి తెచ్చానని.. ఇప్పటికీ చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తానికి వార్నింగ్ల దగ్గర నుంచి చర్చలకు ట్రంప్ తెరలేపారు.
Also Read
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
- Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
ఇది కూడా చదవండి: Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి.. నిరసనకారులను చంపితే సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రానికి వచ్చి మోహరించింది. తక్షణమే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్-నెతన్యాహు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!
ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ పీస్లో ఇజ్రాయెల్ చేరింది. చాలా రోజుల తర్జన భర్జన తర్వాత నెతన్యాహు సంతకం చేశారు. ఈ ఫోరమ్లో పాశ్చాత్య భాగస్వాములతో పాటు టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయి. గతంలో గాజాలో వారి పాత్రపై ఇజ్రాయెల్ విమర్శలు చేసింది. మొత్తానికి శాంతి మండలిలో ఇజ్రాయెల్ చేరింది.

తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!