Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్.. మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
- ఇరాన్కు నెతన్యాహు తీవ్ర వార్నింగ్
- మునుపెన్నడూ చూడని శక్తిని చూస్తారని హెచ్చరిక
- గాజా శాంతి మండలిని వ్యతిరేకించిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ను నిన్నామొన్నటి దాకా ట్రంప్ పదే పదే వార్నింగ్లు ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా మెత్తబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు వచ్చింది. తాజాగా ఇరాన్కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలియని శక్తిని చూస్తారంటూ సూచించారు.
ఇది కూడా చదవండి: Greenland: గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు.. అమెరికా యుద్ధ విమానాలు మోహరింపు!
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
నెస్సెట్లో నెతన్యాహు ప్రసంగించారు.. ‘‘టెహ్రాన్ దాడి చేసే ధైర్యం చేస్తే.. దానికి సాటిలేని శక్తితో ప్రతిస్పందన ఉంటుంది.’’ అని ఇరాన్ను ఉద్దేశించి నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్లో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికా సైనిక చర్యకు దిగుతోందని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అమెరికా అణుశక్తితో నడిచే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక మధ్యప్రాచ్యం వైపు బయలు వెళ్లింది. అయితే అమెరికా దాడి చేస్తే ప్రతీ దాడి తీవ్రంగా ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో నెతన్యాహు తాజాగా ఈ వ్యా్ఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరని.. కానీ దాని గతి గతాన్ని పోలి ఉండదన్నారు. ఇరాన్లో పాలన మార్పు గురించి నెతన్యాహు సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేడు నితిన్ నబిన్ ప్రమాణస్వీకారం
ఇక గాజా విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాజా విషయంలో శాంతి మండలి ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం గాజాను ఇజ్రాయెలే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో టర్కీ, ఖతార్, మరికొన్ని ఇతర దేశాలతో శాంతి మండలి ఏర్పాటు చేస్తానని ట్రంప్ చెప్పడాన్ని మిత్ర దేశమైన అమెరికా తీరును ఇజ్రాయెల్ తప్పుపడుతోంది. హమాస్ను పూర్తిగా నిరాయుధీకరణ చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే విధానపరమైన తేడాలు ఉన్నప్పటికీ అమెరికాతో స్నేహం కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!