Maharashtra: ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. 40 గంటలు నిలిచిన ట్రాఫిక్.. ప్రజలకు నరకం
- ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
- 40 గంటలు నిలిచిన ట్రాఫిక్
- నరకయాతన అనుభవించిన మహిళలు, పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాల్లో ఉన్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తాగేందుకు నీళ్లు లేక.. ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఒక వాహనదారుడు మాట్లాడుతూ… ‘‘మేము మధ్యాహ్నం పుణె నుంచి ప్రయాణాన్ని ప్రారంభించామని..పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. టోల్ వసూలు చేసి మమ్మల్ని ముందుకు పంపేసి ఇరుక్కుపోయేలా చేశారు. కనీసం అధికారులు సమాచారం తెలియజేయాలి కదా?. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఒక్క పోలీస్ కూడా లేరు’’. అంటూ వాపోయాడు.
ప్రస్తుతం గ్యాస్ ట్యాంకర్ను అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ను నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టోల్ వసూలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాలు క్లియర్ చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముంబై వైపు వెళ్తున్న గ్యా్స్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, పిల్లలు అయితే నరకయాతన పడ్డారు. నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఇక టాయిలెట్కు వెళ్లలేక మహిళలకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి వాహనాల్లోనే బందీ అయిపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా కూరగాయాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.

#WATCH | Pune, Maharashtra: Tanker overturn on the Mumbai-Pune highway causes traffic jam in Urse Maval area.
A resident says, "We started our journey from Pune in the afternoon… There has been no information from the police at all… They are deducting the tolls and sending… https://t.co/et0NPgQcAu pic.twitter.com/hVhxWfSz7I
— ANI (@ANI) February 5, 2026
#WATCH | Maharashtra: A chemical tanker overturned on the Mumbai-Pune highway at Khandala Ghat; traffic not fully restored even after 24 hours. pic.twitter.com/AX2LfHwqyo
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?