Maharashtra: ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. 40 గంటలు నిలిచిన ట్రాఫిక్.. ప్రజలకు నరకం
- ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
- 40 గంటలు నిలిచిన ట్రాఫిక్
- నరకయాతన అనుభవించిన మహిళలు, పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాల్లో ఉన్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తాగేందుకు నీళ్లు లేక.. ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
Also Read
- Gallantry Awards 2026: వీర సైనికులకు గొప్ప గౌరవం.. శౌర్య, కీర్తి చక్ర సహా 78 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
- Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
ఒక వాహనదారుడు మాట్లాడుతూ… ‘‘మేము మధ్యాహ్నం పుణె నుంచి ప్రయాణాన్ని ప్రారంభించామని..పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. టోల్ వసూలు చేసి మమ్మల్ని ముందుకు పంపేసి ఇరుక్కుపోయేలా చేశారు. కనీసం అధికారులు సమాచారం తెలియజేయాలి కదా?. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఒక్క పోలీస్ కూడా లేరు’’. అంటూ వాపోయాడు.
ప్రస్తుతం గ్యాస్ ట్యాంకర్ను అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ను నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టోల్ వసూలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాలు క్లియర్ చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముంబై వైపు వెళ్తున్న గ్యా్స్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, పిల్లలు అయితే నరకయాతన పడ్డారు. నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఇక టాయిలెట్కు వెళ్లలేక మహిళలకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి వాహనాల్లోనే బందీ అయిపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా కూరగాయాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.

#WATCH | Pune, Maharashtra: Tanker overturn on the Mumbai-Pune highway causes traffic jam in Urse Maval area.
A resident says, "We started our journey from Pune in the afternoon… There has been no information from the police at all… They are deducting the tolls and sending… https://t.co/et0NPgQcAu pic.twitter.com/hVhxWfSz7I
— ANI (@ANI) February 5, 2026
#WATCH | Maharashtra: A chemical tanker overturned on the Mumbai-Pune highway at Khandala Ghat; traffic not fully restored even after 24 hours. pic.twitter.com/AX2LfHwqyo
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!