Maharashtra: ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. 40 గంటలు నిలిచిన ట్రాఫిక్.. ప్రజలకు నరకం
- ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా
- 40 గంటలు నిలిచిన ట్రాఫిక్
- నరకయాతన అనుభవించిన మహిళలు, పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాల్లో ఉన్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తాగేందుకు నీళ్లు లేక.. ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
ఒక వాహనదారుడు మాట్లాడుతూ… ‘‘మేము మధ్యాహ్నం పుణె నుంచి ప్రయాణాన్ని ప్రారంభించామని..పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. టోల్ వసూలు చేసి మమ్మల్ని ముందుకు పంపేసి ఇరుక్కుపోయేలా చేశారు. కనీసం అధికారులు సమాచారం తెలియజేయాలి కదా?. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఒక్క పోలీస్ కూడా లేరు’’. అంటూ వాపోయాడు.
ప్రస్తుతం గ్యాస్ ట్యాంకర్ను అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ను నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టోల్ వసూలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాలు క్లియర్ చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముంబై వైపు వెళ్తున్న గ్యా్స్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, పిల్లలు అయితే నరకయాతన పడ్డారు. నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఇక టాయిలెట్కు వెళ్లలేక మహిళలకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి వాహనాల్లోనే బందీ అయిపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా కూరగాయాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.

#WATCH | Pune, Maharashtra: Tanker overturn on the Mumbai-Pune highway causes traffic jam in Urse Maval area.
A resident says, "We started our journey from Pune in the afternoon… There has been no information from the police at all… They are deducting the tolls and sending… https://t.co/et0NPgQcAu pic.twitter.com/hVhxWfSz7I
— ANI (@ANI) February 5, 2026
#WATCH | Maharashtra: A chemical tanker overturned on the Mumbai-Pune highway at Khandala Ghat; traffic not fully restored even after 24 hours. pic.twitter.com/AX2LfHwqyo
— ANI (@ANI) February 4, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!