ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు.
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు.. టాటా గ్రూప్ ఛైర్మెన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ESR group హెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సాదత్ షా, హెచ్పీఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ Blue star Limited డిప్యూటీ ఛైర్మెన్ వీర్ అద్వానీతో సహా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు మంత్రి నారా లోకేష్..…
అరేబియా సముద్రంలో తీవ్రమైన ‘శక్తి’ తుఫాన్ ఏర్పడింది. ప్రస్తుతం తీరం వైపునకు దూసుకొస్తోందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 420 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లుగా పేర్కొంది. గుజరాత్, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వెల్లడించింది.
ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు తీసుకు వస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. పాడ్ ట్యాక్సీలు అంటే…
భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ముంబైలోని ఇందిరా డాక్ దగ్గర అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ను రూ.7,870 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్ను మోడీ ప్రారంభించనున్నారు.
మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్గా ప్రమాణం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్ హెల్ప్లైన్కు బెదిరింపు వచ్చింది.