లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది.
Viral Video: ఈ రోజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, ఎన్సీపీ(శరద్ పవార్) వంటి ఇండియా కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి.
Waqf Bill : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రాజకీయ వేడి నిరంతరం పెరుగుతోంది. కాగా, ఈరోజు లోక్సభలో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఉదయం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు.
వయనాడ్లో ప్రకృతి విలయతాండవం చేసింది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. అయితే ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు.
Vinesh Phogat: ఒలింపిక్స్లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్కి గురైంది.
2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపిందని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు…
అగ్నిపథ్పై లోక్సభలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష నేత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్నాథ్ ఆరోపిస్తూ.. ఈ అంశంపై సభలో చర్చిస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.