JPC Members: జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు 48 గంటల డెడ్లైన్..?
- జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు 48 గంటల డెడ్లైన్..
- శుక్రవారం సాయంత్రంలోపు జేపీసీ సభ్యులను స్పీకర్ ప్రకటించాల్సి ఉంది..
- ఇప్పటికే అన్ని పార్టీలకు ఎంపీ పేర్లు ఇవ్వాలని కోరిన స్పీకర్ కార్యాలయం..
JPC Members: లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లుపై మంగళవారం ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్లో ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ వచ్చింది. జమిలి ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ సవరణ బిల్లులు.. దానికి ఆమోదం పొందాలంటే తప్పకుండా 3/2 మెజారిటీ అవసరం. దీంతో సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ఇక, జేపీసీ ఏర్పాటు ప్రక్రియను స్టార్ట్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సభకు చెప్పుకొచ్చారు.
Read Also: GameChanger : గేమ్ ఛేంజర్ లో ఆ రెండు బ్లాక్ లు ఫ్యాన్స్ కు పూనకాలే
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
అయితే, జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది. లేదంటే, జమిలి ఎన్నికల బిల్లులపై మంగళవారం నాడు లోక్సభలో ఓటింగ్తో చేసిన తీర్మానం గడువు ముగుస్తుంది.
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
కాగా, జేపీసీ సభ్యులను స్పీకర్ ప్రకటించకపోతే.. మరోసారి జమిలి ఎన్నికల బిల్లులను ఫ్రెష్గా లోక్సభలో ప్రవేశ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అలా జరగొద్దంటే.. శుక్రవారం సాయంత్రంలోగా జేపీసీపై లోక్సభ స్పీకర్ ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండొచ్చు.. వీరిలో లోక్సభ నుంచి 21 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉండనున్నారు. ఇక, జేపీసీ సభ్యత్వం కోసం ఎంపీల పేర్లు ఇవ్వాలని ఇప్పటికే లోక్సభ స్పీకర్ కార్యాలయం అన్ని ప్రధాన పార్టీలను కోరినట్లు సమాచారం. బిల్లుపై సమగ్ర చర్చలు జరిపేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఉంటది. అవసరాన్ని బట్టి ఈ గడువును అప్పుడప్పుడు పొడిగిస్తారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!