Panchayat se Parliament 2.0: దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్సభలో స్టార్ట్ కానుంది.
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాలు.. ఆందోళనల కోసం సమయం వృథా అయిపోయింది. మొత్తం మూడు సెషన్లు కలిపి దాదాపు 70 గంటలకు పైగా సమయం కోల్పోయినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.
జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కోసం బీజేపీ ఎంపీలకు సోమవారం హైకమాండ్ విప్ జారీ చేసింది.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్…
One Nation One Election Bill: నేడు లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ” ఒకే దేశం, ఒకే ఎన్నికల ” బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్సభలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు’పై చర్చ జరుగుతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు…