One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
- జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ..
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న చర్యలు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. తక్షణమే జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సభ్యులైన సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Also Read
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు – 2024ను కేంద్ర మంత్రి సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే, ఆ తర్వాత వాటిని జరిపే వీలును జమిలీ ఎన్నికల బిల్లులో ఇవ్వడం జరిగింది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు, వాటిని తర్వాత నిర్వహించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేసే అవకాశాన్ని 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2, క్లాజ్ 5 లో కల్పించనున్నారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు వాటిని తర్వాత నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!