One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
- జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ..
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న చర్యలు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. తక్షణమే జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సభ్యులైన సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినేట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు – 2024ను కేంద్ర మంత్రి సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే, ఆ తర్వాత వాటిని జరిపే వీలును జమిలీ ఎన్నికల బిల్లులో ఇవ్వడం జరిగింది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు, వాటిని తర్వాత నిర్వహించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేసే అవకాశాన్ని 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2, క్లాజ్ 5 లో కల్పించనున్నారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు వాటిని తర్వాత నిర్వహించవచ్చు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!