రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
తెలంగాణలోకి పెట్టుబడులు తెచ్చే విధంగా మంత్రి కేటీఆర్ యూకే పర్యటన సాగుతోంది. వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ తెలంగాణ పెట్టుబడులకు అనువైన పరిస్థితులను గురించి వివరిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ మరియు సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణ పై చర్చించారు. పియర్సన్ కంపెనీ…
తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చాలా చోట్ల వడ్లు కల్లాల్లో ఉండగా… వర్షాల వల్ల తడిసి పోయాయి. కనీసం వడ్లపై కప్పేందుకు టార్పలిన్ కవర్లు లేక రైతుల చాలా నష్టపోతున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల మామిడి పూత రాలింది. అయితే సర్కార్ రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్లే రైతులు నష్టపోతున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా టీపీసీసీ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల…
తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్ మండి పడ్డారు. అమిత్ షా సభ తర్వాత TRS నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని ఎద్దేవ చేశారు. బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి, అసమర్థ , బాధ్యత రహిత్య మంత్రి కేటీఆర్ అంటూ మండి పడ్డారు. ఏసీబీ ట్రాప్…
తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. దీనిపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు. అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్ ఉందని మండిపడ్డారు. జనం గోస – బీజేపీ భరోసా అంటే జనాలను గోస పెడతామని కచ్చితమైన భరోసా బీజేపీ ఇచ్చిందని అన్నారు. ఎస్సి రిజర్వేషన్ల ఫైల్, ఎస్టీల ఫైల్, బీసీ జనగణన ఫైల్ కేంద్రం దగ్గరే పెట్టుకుందని…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్నడుస్తోందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ‘’వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..’’ అంటూ అమిత్షాను ఉద్దేశించి సైటైర్ వేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా అదే తంతు ఇంకా కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అంటే…
తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా పర్యటన విజయవంతం అయిందని బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటుంటే..విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. అమిత్ షా హైదరాబాద్ రాజకీయ పర్యటనపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. వొక్కసారి గెలిపించండి ప్లీజ్ అంటూ వీరోచితంగా పర్యటన సాగించి అమిత్ షాను ఆహ్వానించి అట్టహాసంగా బహిరంగసభ పెట్టి దీనంగా “వొక్కసారి ” అంటే వురి వొక్కసారే వేశారంటే చాలు రెండోసారికి అవకాశం వుండదు అన్నట్టుగా నారాయణ తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీని తెలంగాణాలో ఒక్కసారి…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో కూడిన లేఖను అమిత్ షా కు వ్రాశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు బాధితులు ఎవరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన… మోడీ వ్యాఖ్యలపై…
మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్టెక్ వెల్ పంపింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి…