KTR: ప్రతిపక్షాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం, జీడీపీపై కూడా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంక వ్యవహారంలో మోదీ-అదానీలపై విమర్శలు గుప్పిస్తోంది. శ్రీలంక సిలోన్ పవర్ కార్పోరేషన్ చైర్మన్ ఫెర్నినాండో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పవర్ ప్రాజెక్ట్ అదానీకి ఇవ్వాలని మోదీ, అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండియాలో రాజకీయ వేడిని రగిల్చాయి. బుధవారం ఈ అంశంపై ‘ మోడీ మస్ట్ రిజైన్’ అనే హాష్ ట్యాగ్ తో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
తాజాగా మంత్రి కేటీఆర్ ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్స్ పై స్పందించారు. తాజాగా ఈ అంశంపై ట్వీట్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయని.. కానీ శ్రీలంక ప్రభత్వ సీనియర్ అధికారులు పవన విద్యుత్ ఒప్పందంలో ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేసినప్పుడు ప్రధాని కానీ, అదానీ కానీ స్పందించరని.. మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. చెవిటి నిశ్శబ్దం అంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!