పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని…
నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ స్థాపించినా, పాదయాత్ర చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే పాదయాత్రను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఆదరిస్తామన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు అని మహేష్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు…
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం చుట్టూ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన, కవిత పేరు ఎత్తకుండానే పరోక్షంగా గట్టి కౌంటర్లు ఇచ్చారు. కొత్త పార్టీల ఆవిర్భావంపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ, ప్రజలు ఓట్లు వేయాలి కదా అని కేటీఆర్ ఎద్దేవా…
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒకరి దోపిడీని మరొకరు బయటపెట్టకుండా పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న “ఇచ్చి-పుచ్చుకునే బంధం” స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వందల కోట్ల కాంట్రాక్టులు…
ఆ పార్టీ ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వబోతుందా.. అందరూ వృద్ధ నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయా.. అలాంటి విమర్శలకు పార్టీ ఎలాంటి సమాధానమిస్తుంది.. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కామెంట్ పై పార్టీలో ప్రశ్నిస్తున్న యువ నేతలకు పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది.. వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయన అధికారికంగా చేరకముందే గులాబీ తోటలో…
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు.. ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు , పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ…
తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి కొత్త మలుపునిస్తూ అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి స్వయంగా విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
తెలంగాణ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్ధండ పిండం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఇమేజ్కే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే…
భాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు అక్షర (23), దిశీర (19) తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడు అభిరామ రెడ్డి , డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయాలపాలయ్యారు. Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా…
Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ రెండూ కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో…బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే… కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరిగింది. కానీ… తమకు పూర్తి స్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనల్ని అంత సీరియస్గా తీసుకోలేదు.…