Indian Army: పాకిస్థాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే, ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని వెస్ట్రన్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాలలో “రామ్ ప్రహార్” విన్యాసాల చివరి రోజున ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ…
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బుద్ధి ఇంకా మారలేదు. పహల్గామ్ దాడి తర్వాత, పాక్ సైన్యాన్ని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా చిత్తు చేసినప్పటికీ, ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మరోసారి, భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి, పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అని పాక్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం…
Pakistan Security Crisis: ఈ ఏడాది పాకిస్థాన్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. వాస్తవానికి పాకిస్థాన్ తన స్వయం కృత చర్యల కారణంగా మూడు వైపుల నుంచి యుద్ధం పరిస్థితులను సృష్టించుకుందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ తూర్పు వైపులో భారతదేశంతో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో తీవ్ర ఘర్షణ చెలరేగుతోంది. ఇప్పటికే తాలిబన్లు డజన్ల కొద్దీ పాకిస్థాన్ సైనికులను చంపి, అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో వైపున నైరుతిలోని…
Pakistan Crisis: దాయది దేశం పద్మవ్యూహంలో చిక్కుకుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ మాస్టర్ వ్యూహకర్తగా ఉండటానికి ఉత్సాహపడుతుందని, కానీ ఆ దేశానికి అది సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం పాక్కు భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది, మరోవైపు బలూచిస్థాన్, ఖైబర్-పఖ్తుంఖ్వాలో రెండు అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి. ఈ సవాళ్లు అనే పద్మవ్యూహంలో పాక్ సైన్యం చిక్కుకోడానికి అనేక పాపాలు చేసిందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా దాయది దేశం డబుల్…
2021లో ఆఫ్ఘనిస్తాన్లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ…
Operation Sindoor: పాకిస్తాన్కు ఒక రోజు వ్యవధిలో భారతదేశానికి చెందిన కీలక అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏదైనా సాహసోపేత చర్య పాల్పడొద్దని హెచ్చరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ లు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.