S Jaishankar: ‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్పై దాడి చేసే హక్కు భారత్కు ఉంది..
- పాక్ చెడు పొరుగుదేశం..
- ఉగ్రవాదానికి పాల్పడితే దాడి చేసే హక్కు ఉంది..
- దాయాదికి జైశంకర్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, “మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు” అని మంత్రి ఆపరేషన్ సిందూర్ను ఉద్దేశించి అన్నారు.
గతేడాది భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా తన ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కును వినయోగించుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై భీకర దాడులు చేసింది. పీఓకే, పాక్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం, భారత్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ఫోర్స్కు చెందిన 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అయితే, పాక్ విధానాలను ఎండగడుతూ జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మీకు చెడ్డ పొరుగువాడు ఉండొచ్చు. దురదృష్టవశాత్తు, మనకు చెడ్డ పొరుగువారు ఉంటారు. మీరు పశ్చిమాన ఉన్నవారి వైపు చూస్తే, ఒక దేశం ఉద్దేశపూర్వకంగా, నిరంతరంగా, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే, దేశ ప్రజలను ఉగ్రవాదం నుండి రక్షించే హక్కు మనకు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగిస్తాము” అని జైశంకర్ అన్నారు. ఆ హక్కును మనం ఎలా వినియోగించుకుంటామనేది మన ఇష్టం అని, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని ఏ దేశం కూడా మనకు చెప్పలేదని, మనం మనల్ని రక్షించుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాము అని అన్నారు. సిందూ జలాలా ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడుతూ.. నాతో నీటిని పంచుకోండి, కానీ నేను మీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తానని చెబితే మంచి సంబంధాలు ఉండవని అన్నారు.
#WATCH | Tamil Nadu: On being asked about India's neighbourhood policy, EAM Dr S Jaishankar says, "… You can also have bad neighbours. Unfortunately, we do. When you have bad neighbours, if you look to the one to the west. If a country decides that it will deliberately,… pic.twitter.com/8w6dgDHLtc
— ANI (@ANI) January 2, 2026
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!