Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..
- భారత్ లక్ష్యంగా ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేస్తున్న పాక్..
- అసిమ్ మునీర్ నేతృత్వంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న దళం..
- ఆపరేషన్ సిందూర్ భంగపాటు తర్వాత పాక్ రక్షణ చర్యలు..
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేయనుంది. పాక్ సైన్యం చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్(సీడీఎఫ్) అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.
Also Read
- AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
- Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్, 2015లో చైనా స్థాపించిన రాకెట్ ఫోర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కమాండ్కు లెఫ్టినెంట్ జనరల్(త్రీస్టార్) లేదా మేజర్ జనరల్ (టూ స్టార్) హోదా కలిగిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ నిలువరించలేకపోయింది.
ఇదిలా ఉంటే, భారత్ కూడా శక్తివంతమైన రాకెట్ ఫోర్స్ను సృష్టించాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చైనా, పాక్ సరిహద్దుల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్సోనిక్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో సైన్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
-
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
-
Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
-
AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!