Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..
- భారత్ లక్ష్యంగా ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేస్తున్న పాక్..
- అసిమ్ మునీర్ నేతృత్వంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న దళం..
- ఆపరేషన్ సిందూర్ భంగపాటు తర్వాత పాక్ రక్షణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేయనుంది. పాక్ సైన్యం చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్(సీడీఎఫ్) అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్, 2015లో చైనా స్థాపించిన రాకెట్ ఫోర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కమాండ్కు లెఫ్టినెంట్ జనరల్(త్రీస్టార్) లేదా మేజర్ జనరల్ (టూ స్టార్) హోదా కలిగిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ నిలువరించలేకపోయింది.
ఇదిలా ఉంటే, భారత్ కూడా శక్తివంతమైన రాకెట్ ఫోర్స్ను సృష్టించాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చైనా, పాక్ సరిహద్దుల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్సోనిక్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో సైన్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!