Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..
- భారత్ లక్ష్యంగా ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేస్తున్న పాక్..
- అసిమ్ మునీర్ నేతృత్వంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న దళం..
- ఆపరేషన్ సిందూర్ భంగపాటు తర్వాత పాక్ రక్షణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేయనుంది. పాక్ సైన్యం చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్(సీడీఎఫ్) అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్, 2015లో చైనా స్థాపించిన రాకెట్ ఫోర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కమాండ్కు లెఫ్టినెంట్ జనరల్(త్రీస్టార్) లేదా మేజర్ జనరల్ (టూ స్టార్) హోదా కలిగిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ నిలువరించలేకపోయింది.
ఇదిలా ఉంటే, భారత్ కూడా శక్తివంతమైన రాకెట్ ఫోర్స్ను సృష్టించాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చైనా, పాక్ సరిహద్దుల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్సోనిక్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో సైన్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!