Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి.…
Encounter: నేడు (నవంబర్ 11, 2024) మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో CRPF సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఎన్కౌంటర్ సమయంలో ఒక CRPF జవాన్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో సోమవారం ఉదయం మిలిటెంట్లు సమీప కొండ ప్రాంతాల నుండి అతనిపై కాల్పులు జరపడంతో ఒక…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్ను నాగ్పూర్లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
Bahraich violence: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్లో దుర్గాపూజ సమయంలో అల్లర్లకు కారణమై, గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులపై ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు సర్ఫరాజ్ అలియాస్ రింకు, ఫాహిమ్ నేపాల్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హండా బసెహ్రీ కెనాల్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు నిందితుల కాలిలో కాల్చినట్లు తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అక్కడ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తరుచూ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ రోజు కథువా జిల్లాలోని బనీ ప్రాంతంలో భద్రతా బలగాలు,
Encounter: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్లో ఇప్పటివరకు చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇదే సమయంలో మన సైనికులు కూడా చాలా మంది వీరమరణం పొందారు. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్లో నలుగురు ఆర్మీ సైనికులు కూడా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. రహస్య సమాచారం ఆధారంగా…
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్స్టర్ మంగేష్ యాదవ్ హతమయ్యాడు. అతడి తలపై రూ.1లక్ష రివార్డు ఉంది. ఆగస్టు 28న వారణాసిలోని తాథేరి బజార్లోని నగల దుకాణంలో రూ.1.5 కోట్లు విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడ్డాడు.