Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్కౌంటర్..
- జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..
- విలేజ్ గార్డుల్ని చంపిన ఉగ్రవాదుల్ని గుర్తించిన భద్రతా బలగాలు..
- నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Read Also: Varanasi: ఒకే గ్రామంలోని 40 మంది వర్జిన్ అమ్మాయిలను.. గర్భిణులుగా ప్రకటిస్తూ మెసేజ్..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇటీవల అధ్వరి నుంచి ఇద్దరు గ్రామ రక్షణ సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి గురువారం కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కినట్లు కిష్ట్వార్ పోలీసులు ధృవీకరించారు. “కేష్వాన్ కిష్త్వార్లో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. 3-4 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఇద్దరు అమాయక గ్రామస్తులను చంపింది ఇదే గుంపు” అని వారు చెప్పారు.
గడిచిన 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్లో ఇది మూడో ఎన్కౌంటర్. అంతకుముందు శ్రీనగర్లోని జబర్వాన్ అడవిలో ఉగ్రవాద వ్యతిరేఖ ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇది నిన్న బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. రాజ్పురా ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన తర్వాత భద్రతా దళాలు మరియు రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్ను ప్రారంభించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!