Kulgam Encounter: కుల్గామ్లో ఎన్కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్
- దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో.
- భారత దేశ భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్.
- ఎంటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, ఈ ఎన్కౌంటర్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ మొదలయింది.
Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
అలాగే, కుప్వారాలోని నాగ్మార్గ్లో ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ప్రాంతం బందిపోరా జిల్లాకు ఆనుకొని ఉంది. ఇది కాకుండా ఈ ప్రాంతం LOC సరిహద్దులో ఉంది. కాశ్మీర్ లోకి చొరబడే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని బండిపోరా, సోపోర్, గందర్బాల్, శ్రీనగర్ మీదుగా దక్షిణ కాశ్మీర్కు చేరుకుంటారు. మరోవైపు, నాగ్మార్గ్లో ఉగ్రవాదులు కనిపించారనే సమాచారంతో భద్రతా బలగాలు తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాస్త ఎత్తులో దట్టమైన చెట్ల కింద ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని చుట్టుముట్టేందుకు ఒక భద్రతా బలగాలు కుప్వారా నుంచి, మరో స్క్వాడ్ బండిపోరా జిల్లాలోని రుబందీపూర్ ప్రాంతం నుంచి బయలుదేరాయి. సీజ్లో ఉన్న వారిని చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో సైనికులు కూడా తమను తాము రక్షించుకోవడానికి ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు గంటపాటు ఇరువైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది హతమయ్యారో ఇంకా సమాచారం లేదు.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!