Kulgam Encounter: కుల్గామ్లో ఎన్కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్కౌంటర్
- దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో.
- భారత దేశ భద్రతా బలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్.
- ఎంటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulgam Encounter: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత దేశ భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్ లోని ఎల్ఓసీకి ఆనుకుని ఉన్న కుప్వారా జిల్లాలో సైనికులు నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్ ప్రారంభంలో కొన్ని కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఎన్కౌంటర్ స్థలం చుట్టూ భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. అనుమానిత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి, ఈ ఎన్కౌంటర్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ మొదలయింది.
Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
అలాగే, కుప్వారాలోని నాగ్మార్గ్లో ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ప్రాంతం బందిపోరా జిల్లాకు ఆనుకొని ఉంది. ఇది కాకుండా ఈ ప్రాంతం LOC సరిహద్దులో ఉంది. కాశ్మీర్ లోకి చొరబడే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని బండిపోరా, సోపోర్, గందర్బాల్, శ్రీనగర్ మీదుగా దక్షిణ కాశ్మీర్కు చేరుకుంటారు. మరోవైపు, నాగ్మార్గ్లో ఉగ్రవాదులు కనిపించారనే సమాచారంతో భద్రతా బలగాలు తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాస్త ఎత్తులో దట్టమైన చెట్ల కింద ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని చుట్టుముట్టేందుకు ఒక భద్రతా బలగాలు కుప్వారా నుంచి, మరో స్క్వాడ్ బండిపోరా జిల్లాలోని రుబందీపూర్ ప్రాంతం నుంచి బయలుదేరాయి. సీజ్లో ఉన్న వారిని చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో సైనికులు కూడా తమను తాము రక్షించుకోవడానికి ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు గంటపాటు ఇరువైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది హతమయ్యారో ఇంకా సమాచారం లేదు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!