Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్..
- జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..
- భద్రతా బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు..
- ఎన్నికల ముందు పేట్రేగిపోతున్న ఉగ్రమూకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అక్కడ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తరుచూ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ రోజు కథువా జిల్లాలోని బనీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం రావడంతో ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు తెలిపారు.
Read Also: Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, చైనా వ్యూహాలపై ఇండియన్ నేవీ అత్యున్నత సమావేశం..
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ అంతటా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల్ని మన జవాన్లు మట్టుపెడుతున్నారు. అయితే, ఈ ఆపరేషన్లలో మన జవాన్లు కూడా వీరమరణం పొందుతున్నారు. మొదట్లో పూంచ్, రాజౌరీ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు జమ్మూ ప్రాంతానికి కూడా విస్తరించాయి. ఉధంపూర్, కథువా జిల్లాల్లో గతంలో ఉగ్రవాదం లేదు, కానీ ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. అత్యున్నత శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైనికులు కాన్వాయ్లపై మెరుపు దాడులు చేస్తున్నారు. గ్రెనేడ్స్, ఎం4 అసాల్ట్ రైఫిళ్లను వాడుతున్నారు.
గత రెండేళ్లుగా కాశ్మీర్ లోయను జమ్మూతో విభజిస్తున్న పీర్ పంజాల్ ప్రాంతంలో తిరుగుబాటు పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులు, కొండలు, గుహాలు ఉగ్రవాదులకు కేంద్రంగా మారుతున్నాయి. అదును చూసి దాడులకు తెగబడుతున్నారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!