Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిలీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Abhishek Rao's custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది.
బీజేపీ నేత, టిక్టిక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఆమెను హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
CBI questions former J&K Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఆయనను ప్రశ్నించింది. కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.300 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏప్రిల్ నెలలో సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా ఉన్న ఆయన పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసిన…
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్' గరుడ పేరుతో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాలపై సోదాలు చేపట్టింది. ఇంటర్పోల్, ఎన్సీపీతో పాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ 'ఆపరేషన్ గరుడ'ను చేపట్టింది.
దేశంలో బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకి చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు భారత్కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు.. ఇక, గుజరాత్లో భారీ బ్యాంక్ స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఏకంగా రూ.22,842 కోట్ల రూపాయలను.. ఏబీజీ షిప్యార్డ్ అనే కంపెనీ మోసం చేసింది.. 28 బ్యాంకులను ముంచేసింది ఆ సంస్థ… ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఈ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్యార్డు, డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామితో పాటు అశ్వినీ…
CBI petition to cancel Tejaswi Yadav's bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు…