Dehi Liquor Scam: లిక్కర్ స్కాం.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dehi Liqour Scam: దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా ఆప్ కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమైందని సమాచారం. లిక్కర్ స్కాం కేసులో తాజాగా సీబీఐ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 17 సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం సిసోడియా కేంద్రంగానే సాగిందనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Snake Venom: డార్జిలింగ్లో 2.5కేజీల పాము విషం పట్టివేత.. విలువ రూ.30కోట్లు
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
తనకు సీబీఐ నోటీసు ఇవ్వడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో తన ఇంట్లో 14 గంటలపాటు సీబీఐ సోదాలు జరిపినా వాళ్లకు ఏమి దొరకలేదన్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి దర్యాప్తుకు సహకరిస్తానని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. ఇది ఇలా ఉండగా.. మనీశ్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. సిసోడియాను స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ తో పోల్చుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కటకటాలు, ఉరికంబం భగత్ సింగ్ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయని అన్నారి. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటమని అభివర్ణించారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ తరం భగత్ సింగులని కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మనీశ్ సిసోడియా ఈడీ ముందు నేడు హాజరు అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సిసోడియా అరెస్ట్ రంగం సిద్ధమైందని.. ఆయనను అరెస్ట్ చేస్తే ఆందోళన చేసేందుకు ఆప్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ఢిల్లీలో పలుచోట్ల అందోళనకు అధికారపార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read Also: Rajasthan High Court: భార్యను తల్లిని చేసేందుకు 15రోజులు పర్మిషన్ ఇచ్చిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ లో పలు సార్లు సీబీఐ, ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. పలు సార్లు విచారణ తర్వాత బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక తాము అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్ ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. కస్టడీ విచారణలో అభిషేక్ ఇచ్చిన వివరాల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కాంలో కేసులో త్వరలోనే కీలక నేత అరెస్ట్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!