Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో 34 మంది పాత్ర.. ఈడీ రిమాండ్ డైరీలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ కస్టడీకి అనుమతించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఏకంగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాం ఎలా జరిగిందో అనే వివరాలను రిమాండ్ రిపోర్టులో వివరించింది ఈడీ. శరత్ చంద్రారెడ్డి అరెస్టులో ఈడీ కీలకాంశాలను వెల్లడించింది. ఈ స్కామ్ లో 34 మంది పాత్ర బయటపడినట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటపడటంతో 34 మంది 140 ఫోన్లను ఛేంజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. సెల్ ఫోన్ల మార్పిడి కోసం ఏకంగా రూ. 1.20 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ స్కాంలో విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రోలది కీలక పాత్ర అని ఈడీ ఆరోపిస్తోంది.
Read Also: Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
లిక్కర్ స్కామ్ కోసం శరత్ చంద్రారెడ్డి లాబీ ఏర్పాటు చేసినట్లు తేలింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. సమీర్ మహేంద్రోతో కలిసి రూ.100 కోట్ల వరకు లంచాలను ఎర చూపారని ఆరోపిస్తోంది. శరత్ చంద్రారెడ్డి రూ. 64 కోట్లు వరకు మనీల్యాండరింగ్ కు పాల్పడ్డాడని ఈడీ రిమాండ్ డైరీలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 169 ప్రాంతాల్లో సోదాలు చేశామని, డిజిటల్ డివైజస్ తో పాటు పలు రికార్డులను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. లంచాల కోసం ప్రత్యేక్ వ్యవస్థను శరత్ చంద్రారెడ్డి ఏర్పాటు చేశాడని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ స్కామ్ లో మనీలాండరింగ్ జరిగనట్లు సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. జస్టిస్ నాగ్ పాల్ ఈడీ విచారణ కోసం శరత్ చంద్రారెడ్డి, విజయ్ బాబులను వారం రోజులకు పాటు కస్టడీకి అప్పగించారు. మరోవైపు సోమవారం రోజున దినేష్ ఆరోరా సీబీఐకి అఫ్రూవర్ గా మారారు. స్పెషల్ కోర్టులో దినేష్ అరోరా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఏం చేశారనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..