CBI: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లోకి సీబీఐకి నో ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 States withdraws general consent to CBI, including telangana: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీనే కావాలని కట్టుకథలను అల్లుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి అనుమతిని నిరాకరించింది.
Read Also: Delhi: తుపాకీ గురి పెట్టి టయోటా ఫార్చ్యూనర్ కార్ దొంగతనం.. వైరల్ వీడియో..
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి సాధారణ సమ్మతిని విత్ డ్రా చేసుకుంటూ తెలంగాణతో పాటు పది రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో మేఘాలయ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మిజోరాం రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. ఇలా చేసిన పదో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అంతకుముందు మహారాష్ట్ర కూడా సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకుంది. కానీ ఆ తరువాత ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుంది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో బీహర్ పర్యటన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విధంగా విమర్శలు చేశారు.
రెండు నెలల క్రితమే సీబీఐకి సాధారణ సమ్మతిని విత్ డ్రా చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. సీబీఐ విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో అదనపు అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు ఈ విషయం తెలియజేసే వరకు అది పబ్లిక్ డొమైన్ లో కనిపించలేదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946( కేంద్ర చట్టం XXV 1946) సెక్షన్ 6 కింద రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది.
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!